అమెరికాలో గాంధీ మహాత్ముడి విగ్రహం ధ్వంసం

అమెరికాలో గాంధీ మహాత్ముడి విగ్రహం ధ్వంసం

వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు సమాచారం. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా అమెరికాలో నల్లజాతీయులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గాంధీ విగ్రహం ధ్వంసానికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ పార్క్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story