ఆరుగురికి కరోనా పాజిటివ్ : ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్

ఆరుగురికి కరోనా పాజిటివ్ : ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్

ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధానకార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు అధికారులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వారిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా సోకిన అధికారులతో సంప్రదింపులు జరిపిన 10 మందికి పైగా అధికారులను నిర్బంధ కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం కరోనా ‌ రావడంతో కార్యాలయాన్ని రెండు రోజులపాటు సీజ్‌ చేశారు అధికారులు. అన్ని భవనాల్లో ప్రస్తుతం శానిటైజ్ పనులు కొనసాగుతున్నాయి.

కాగా ఇటీవల, ఈడీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే జూనియర్-ర్యాంక్ అధికారికి వైరస్ సోకింది. ఆయన కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ నుండి దర్యాప్తు సంస్థకు డిప్యుటేషన్ ద్వారా వచ్చారని, వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. ఇదిలావుంటే ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,334 కు చేరింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,887 కొత్త కేసులు నమోదు కాగా.. 294 మరణాలు సంభవించాయి. భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 2,36,657 చేరుకుంది.. మరణాల సంఖ్య 6,642గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story