ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అస్వస్ధత
By - TV5 Telugu |8 Jun 2020 3:03 PM GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు ఢిల్లీ సీఎం కార్యాలయం తెలిపింది. ఆయన తన అధికారిక కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకున్నారు. కేజ్రీవాల్ కు రేపు కరోనా పరీక్షలు చెయ్యాలని వైద్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మరోవైపు, గత 24 గంటల్లో భారత్ లో 9,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,56,611కు చేరింది, అలాగే వైరస్ కారణంగా 206 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,135 కు చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com