కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ తను ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు: బీజేపీ ఎంపీ
By - TV5 Telugu |11 Jun 2020 5:24 PM GMT
ఏడాది పాలనలో దేశంలోని ప్రతి వర్గానికి ప్రధాని మోదీ న్యాయం చేశారని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు మోదీ రాసిన లేఖను జితేందర్ రెడ్డి విడుదల చేశారు. కరోనా పరిస్థితుల్లో ప్రజల మనోధైర్యాన్ని మోదీ పెంచారన్నారు. లాక్డౌన్లో కేంద్రం పంపిన నిధుల్ని మొదట రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేశారని.. వాటిని సీఎం కేసీఆర్ తమ నిధులుగా చెప్పుకున్నారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితే.. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com