క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్..

కరోనా మహమ్మారి క్రికెట్ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది. ఎప్పుడో మార్చిలో జరగాలసిన ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించాక ఐపీఎల్ నిర్వహణపై ప్రణాళికలు రచిస్తామని గురువారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విదేశాల్లో టోర్నీ నిర్వహించాలనే ఆలోచనైతే ప్రస్తుతానికి లేదని అన్నారు. ప్రేక్షకులు లేకుండా కూడా టోర్నీ నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని బ్రిజేశ్ అన్నారు. క్రికెట్ అభిమానులకు పండగే.. ఐపిఎల్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story