నకిలీ నోట్ల ముఠా ఆటకట్టు.. రూ.87 కోట్లు విలువైన కరెన్సీ స్వాధీనం
By - TV5 Telugu |11 Jun 2020 11:20 PM GMT
మహారాష్ట్రలో నకిలీ నోట్ల ముఠా ఆట కట్టింది. ఏకంగా 87 కోట్ల రూపాయలు విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గ్యాంగ్ను పట్టుకున్నారు. ఎరవాడ సంజయ్ పార్క్ దగ్గర ఓ బంగ్లాలో నకిలీ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆర్మీ అధికారి సాయంతో కొందరు హవాలా రూపంలో సొమ్ము మార్చే క్రమంలో ఈ కట్టల పాములు పట్టుబడ్డాయి.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com