క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్జీ కన్నుమూత
By - TV5 Telugu |13 Jun 2020 1:52 PM GMT
ప్రముఖ మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు అయిన వసంత్ రాయ్జీ కన్నుమూశారు. ఇటీవలే ఆయన 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా మృతి చెందారని అల్లుడు సుదర్శన్ తెలిపారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాయ్జీ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మాన్, 1940 లలో తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడి 277 పరుగులు చేశారు.
ఆయన అత్యధిక స్కోరు 68. 1939 లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు ద్వారా అరంగేట్రం చేశారు. ఆ తరువాత 1941లో ముంబైలో వెస్ట్రన్ ఇండియా జట్టు తరుపున ఆడారు. జనవరిలో 100 ఏళ్లు పూర్తిచేసుకున్న రాయిజీని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ , ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com