శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ టీవీలు ఆన్ లైన్ మార్కెట్లో..

శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ టీవీలు ఆన్ లైన్ మార్కెట్లో..

దక్షిణ కొరియా ఉత్పత్తి శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ప్లిప్ కార్ట్, అమెజాన్, శాంసంగ్ అధికారిక ఆన్ లైన్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వీటిల్లో ఫ్రేమ్ 2020 ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ లో గెట్ మోర్ ఫ్రమ్ టీవీ అంటూ అమెజాన్ లో వండర్ టైన్ మెంట్ అని ప్రచారం చేస్తోంది. ఈ కొత్త ఎడిషన్ స్మార్ట్ టీవీలు యువ మిలీనియల్స్, ఆన్ లైన్ కంటెంట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చమన్నారు.

ఆకర్షణీయమైన కంటెంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆన్ లైన్ బిజినెస్ డైరెక్టర్ పియూష్ కున్నపల్లిల్ చెప్పారు. ఈ టీవీలను పర్సనల్ కంప్యూటర్ లాగా కూడా వాడుకోవచ్చు. దీంతో వర్క్ ఫ్రం చేసే వారికి వెసులుబాటుగా ఉంటుంది. భద్రతకు కూడా ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది కంపెనీ.

ఇక ధర విషయానికి వస్తే 50,55,65 అంగుళాల టీవీల ధరలు వరుసగా రూ.74,990, రూ.84,990, రూ. 1,39,990 గా నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story