బ్యాంకు క్యాషియరే దొంగ.. 15 కిలోల బంగారం..

బ్యాంకు క్యాషియరే దొంగ.. 15 కిలోల బంగారం..

ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరని క్యాషియరే దొంగతనం చేస్తే ఎవరు పట్టుకుంటార్లే అనుకున్నాడేమో ఎస్బీఐ బ్రాంచ్ కి చెందిన ఉద్యోగి. ఇంట్లో దొంగలు పడతారని బ్యాంకు లాకర్ లో బంగారం దాచుకుంటే అది కాస్తా ఆ క్యాషియరే దొంగిలించాడు. మధ్యప్రదేశ్ షియోపూర్ లోని ఎస్బీఐ బ్రాంచిలో 15 కిలోల బంగారం మాయమైనట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో వారికి బ్యాంకు క్యాషియర్ పై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని నిలదీయగా తానే బంగారం దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. తనతో పాటు తన స్నేహితుడు నవీన్, స్నేహితురాలు జ్యోతిలతో కలిసి ఈ చోరీ చేసినట్లు తెలిపాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కిలోల బంగారం 11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story