డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ 'దోస్త్' నోటిఫికేషన్..

డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్..

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.

జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 22న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. జూలై 23 నుంచి 27 వరకు విద్యార్ధులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 30 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్ట్ 7న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

ఆగస్ట్ 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్ట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆగస్ట్ 8 నుంచి 14వ తేదీ వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు.

సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా దోస్త్ ప్రకటన విడుదలలో జాప్యం జరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు వెయ్యికి పైగా డిగ్రీ కాలేజీల్లో 200 కోర్సుల్లో సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story