కరోనాతో ఒక్కరోజే 5023 మంది మృతి
By - TV5 Telugu |1 July 2020 6:43 PM GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అటు కరోనా మరణాల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో.. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
కరోనా వైరస్ వల్ల గడిచిన 24 గంటల్లో 5023 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,05,86,381 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 5,13,925 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతకర వైరస్ బారినపడి చికిత్స పొంది 57,95,755 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 42,18,442 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com