కరోనా ఎఫెక్ట్.. కువైట్ లో ఉన్న భారతీయులు..

కరోనా ఎఫెక్ట్.. కువైట్ లో ఉన్న భారతీయులు..

కువైట్ దేశ జనాభా 48 లక్షలు ఉంటే అందులో విదేశీయులే 34 లక్షల మంది ఉన్నారు. ఇక భారతీయుల సంఖ్య 8 లక్షల మంది. కరోనా వల్ల కువైట్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరోవైపు దేశంలో పెరుగుతున్న విదేశీయులను తగ్గించే క్రమంలో చర్యలు తీసుకుంటోంది. విదేశీయుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ఆ దేశ ప్రదాని షేక్ సబా అల్ ఖలీదా అల్ సబా చూస్తున్నారు.

ఇందుకు సంబంధించి కువైట్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)కి చెందిన చట్టసభ్యుల కమిటీ విదేశీ జనాభా తగ్గింపునకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించింది. బిల్లును ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్ ను వీడాల్సి ఉంటుంది. భారతీయులు ఎక్కువగా ఉపాధి నిమిత్తం కువైట్ తో పాటు గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. మరోవైపు మిగతా గల్ఫ్ దేశాలు కూడా కువైట్ మార్గాన్ని అనుసరించాలని చూస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story