చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మ‌ృతి

చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మ‌ృతి

వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన చైనాలో జరిగింది.

ప్రయాణికుల బస్సు రెయిలింగ్ ను ఢీకొని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. దీతో 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడిపోయిన బస్సును బయటకు వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story