మరో అంతుచిక్కని వైరస్.. 1772 మంది మృతి : చైనా
ఒక వైపు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తుంటే.. మరోవైపు కజిస్థాన్లో అంతుచిక్కని వైరస్ ప్రాణాలను బలితీసుకుంటుంది. కజకిస్థాన్లో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందలాది మంది మృత్యువాత పడ్డారు. కజకిస్థాన్లో గుర్తుతెలియని వైరస్ విజృంభిస్తోందని.. న్యుమోనియా లాంటి లక్షణాలతో జూన్ నెలలో 600 మందికి పైగా మరణించారని.. జాగ్రత్తగా ఉండాలని చైనా ఆ దేశ ప్రజలను హెచ్చరించింది.
ఈ వైరస్ కరోనా కంటే అత్యంత ప్రమాదకారి అని కజకిస్థాన్లో నివసిస్తున్న చైనీయులను.. చైనా హెచ్చరించింది. కాగా, ఈ అంతుచిక్కని వైరస్తో గత ఆరు నెలల్లో 1772 మంది ప్రాణాలు కోల్పోయారనిచైనా తెలిపింది. మృతుల్లో చైనీయులు కూడా ఉన్నట్లు పేర్కొన్నది. వైరస్ను గుర్తించేందుకు ఆరోగ్యశాఖ వర్గాలు ప్రయత్నిస్తున్నా ఇంతవరకు గుర్తించలేక పోయాయని కజకిస్థాన్లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com