బాలీవుడ్ నటి కన్నుమూత.. హృదయం ద్రవించే ఆమె ఆఖరి పోస్ట్

బాలీవుడ్ నటి కన్నుమూత.. హృదయం ద్రవించే ఆమె ఆఖరి పోస్ట్

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్సే కేన్సరుతో కన్నుమూశారు. 'హై అప్పా దిల్ దోహ్ అవారా' చిత్రంలో నటించిన దివ్య సుదీర్ఘకాలం నుంచి కేన్సరుతో పోరాడారు. సమీప బంధువు సౌమ్యా అమిష్ వర్మ సంతాప సందేశం ద్వారా దివ్య మృతిని ధ్రువీకరించారు. సినీ నటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంతాప సందేశం తెలిపారు. మీ అభిరుచి, మీ కల, సినీపరిశ్రమ పట్ల మీ సానుకూలత మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ జ్ఞాపకాలు నా హృదయంలో సజీవంగా ఉంటాయి అని సాహిల్ రాసుకొచ్చారు. దివ్య తన మరణానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టాలో ఫాలోవర్స్ కోసం హృదయాలు ద్రవించే పోస్టు పెట్టారు. కేన్సరుతో నేను నెలల తరబడి మరణ మంచం మీద ఉన్నాను.. దివ్య చౌక్సే బై అని రాశారు.

Tags

Read MoreRead Less
Next Story