వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం.. భారత్ చానళ్లపై నిషేధం ఎత్తివేత
By - TV5 Telugu |14 July 2020 9:57 PM GMT
ఇటీవల కాలంలో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్.. ప్రస్తుతం కాస్తా వెనక్కు తగ్గినట్టు ఉంటుంది. భారత వార్తా చానళ్లపై నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు కేబుల్ ఆపరేట్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. కొన్ని చానళ్లపై బ్యాన్ ఎత్తేస్తున్నామని.. కానీ, అభ్యంతరకర వార్తలను ప్రచారం చేస్తున్న చానళ్లపై మాత్రం నిషేధం కొనసాగుతోందని ఆయన అన్నారు. గతవారం భారత చానళ్లను నేపాల్ నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. ఆ నిర్ణయంపై వెనక్కు తగ్గింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com