ట్విట్టర్ సీఈఓతో పాటు 14.2 కోట్ల మంది డేటా హ్యాక్
టెక్నాలజీ వలన ఎంత మంచ జరుగుతుందో అంతే స్థాయిలో ప్రమాదాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమాచార భద్రతకు రక్షణ లేకుండా పోతుంది. చాలా మంది హ్యాకర్లు కోట్లాది మంది డేటాను కొల్లగొడుతున్నారు. తరువాత దీనిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.
తాజాగా డార్క్వెబ్ ద్వారా 14.2 కోట్ల మంది డేటాను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్న ఎంజీఎం రిసార్ట్స్ హోటల్స్లో బస చేసిన వారి డేటాను అమ్మకానికి పెట్టారు. ఇందులో సెలబ్రిటీలు, టెక్ సీఈవోలు, టెక్ ఉద్యోగులు, పాత్రికేయులు, ప్రభుత్వాధికారులు ఉన్నారు. హ్యాక్ అయినవారి డేటాలో వ్యక్తుల పూర్తి పేర్లు, అడ్రెస్లు, ఫోన్ నంబర్లు, ఈ మెయిళ్ళు, పుట్టిన తేదీలు తదితర వివరాలున్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న డేటాలో... ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ, పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వంటి ప్రముఖుల డేటాలు కూడా ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com