పాక్ తో కలిసి చైనా కుట్ర.. బయో వార్ఫేర్!

పాక్ తో కలిసి చైనా కుట్ర.. బయో వార్ఫేర్!

పాకిస్థాన్ తో కలిసి భారత్ సహా కొన్ని పాశ్చాత్య దేశాలపై కుట్రకు తెరతీసింది చైనా. ప్రత్యర్థులపై విస్తృత దాడిలో భాగంగా, ప్రాణాంతకమైన 'బయోలాజికల్ వార్ఫేర్' (బయో వార్) చెయ్యాలని ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన సామర్థ్యాలను విస్తరించడానికి పాక్ తో మూడేళ్ల పాటు రహస్య ఒప్పందం కుదుర్చుకుంది, వీటిలో ఘోరమైన ఆంత్రాక్స్ తోపాటు అనేక పరిశోధన ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ది క్లాక్సన్ అనే వార్త సంస్థ ఈ కుట్రను వెల్లడించింది.

భద్రతా నిపుణుడు ఆంథోనీ క్లాన్ 'బయోలాజికల్ వార్ఫేర్' పై ఆర్టికల్ రాశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. పాకిస్తాన్ మిలిటరీ యొక్క డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ (డెస్టో) తో రహస్య ఒప్పందంపై చైనా సంతకం చేసిందని పేర్కొన్నారు. కరోనాకు కేంద్రమైన వుహాన్ ల్యాబ్ నుండే పాకిస్తాన్‌ - చైనా బయో-వార్ కి తెరతీసిందని పేర్కొన్నారు. ఇందులో భారతదేశం తోపాటు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు కూడా ఉన్నాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story