బ్రెజిల్లో 23 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్లో కరోనా విజృంభిస్తోంది. గురువారం రికార్డుస్థాయిలో 60 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 55,891 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు 23,43,366 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం నమోదైన కేసుల్లో 15,90,264 మంది కోలుకున్నారు. కరోనాతో శుక్రవారం కొత్తగా 1156 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 85,238కి పెరిగింది. దీంతో ప్రపంచంలో రోజువారీ అత్యధిక కేసులు, మరణాలతోపాటు మొత్తం కేసుల్లో కూడా అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com