గూగుల్ ఉద్యోగులు.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు..

గూగుల్ ఉద్యోగులు.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు..

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రస్తుత పరిస్థితిలో ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడం మంచిదని భావిస్తోంది గూగుల్ సంస్థ. ఇప్పటికే తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన ఈ టెక్ దిగ్గజం.. తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించింది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈమెయిల్స్ పంపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్లను ఇది ఊరటనిచ్చే అంశం. గూగుల్ తీసుకున్న నిర్ణయం మరి కొన్ని కంపెనీలపైనా ప్రభావం చూపనుంది.

Tags

Read MoreRead Less
Next Story