చర్చిలో 4 వేలకు పైగా కరోనా కేసులు.. క్రైస్తవ నాయకుడు అరెస్ట్..

చర్చిలో 4 వేలకు పైగా కరోనా కేసులు.. క్రైస్తవ నాయకుడు అరెస్ట్..

దక్షిణ కొరియాలో, షిన్చోంజి చర్చి అధిపతి, క్రైస్తవ నాయకుడు లీ మాన్-హీ ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో సంక్రమణను నివారించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చెయ్యడానికి స్థానిక కోర్టు కూడా శనివారం ఆమోదం తెలిపింది. దాంతో లీ మాన్-హీ ని అరెస్ట్ చేసి జైలుకు

తరలించారు పోలీసులు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న చర్చిలో 4 వేలకు పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. ఈ చర్చిని సందర్శించే వారి సంఖ్య గురించి లీ ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. అయితే, మార్చిలో ఆయన చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story