ఐపీఎల్కు కేంద్రం గ్రీన్సిగ్నల్
By - TV5 Telugu |2 Aug 2020 11:06 PM GMT
డియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో జరుగుతుంది. టోర్నమెంట్ను దేశం నుంచి బయటకు తరలించడానికి భారత ప్రభుత్వ అనుమతి బోర్డు క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) కు లభించింది. ఐపీఎల్ పాలక మండలి ఆదివారం సమావేశమైన తర్వాత
ఈ అనుమతి వచ్చింది. యుఎఇలో ఆడినప్పటికీ, మ్యాచ్ లు అన్ని సాయంత్రం , రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి తీవ్రంగానే శ్రమించింది. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర వహించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com