ఏపీ మండలిలో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన మోపిదేవి వెంకటరమణ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 మార్చి వరకూ గడువు ఉండటంతో ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. మోపిదేవి వెంకట రమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఈ స్థానానికి మరో 9 నెలలు మాత్రమే గడువు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story