ఏపీలో కొత్తగా 10,328 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో కొత్తగా 10,328 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 63,686 శాంపిల్స్ ను పరీక్షించగా 10,328 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల అనంతపూర్‌ లో పదిమంది, తూర్పు గోదావరి లో పది మంది, గుంటూరు లో తొమ్మిది మంది, చిత్తూర్‌ లో ఎనిమిది మంది, కృష్ణ లో అరుగురు, నెల్లూరు లో ఆరుగురు, ప్రకాశం లో ఆరుగురు, విశాఖపట్నం లో నలుగురు, కడప లో ముగ్గురు,

విజయనగరం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి టే ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు మరియు శ్రీకాకుళం లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 8,516 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,93,894 పాజిటివ్ కేసులకు గాను.. 1,09,975 మంది డిశ్చార్జ్ కాగా.. 1,753 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 82,166 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story