సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు!

సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు!

తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం ఏడు అంతస్తుల భవనం ఉండనుంది. భవనం ఎత్తు 278 అడుగులు.

కాగా.. ఇందులో మధ్యభాగంలో ఎత్తే 111 అడుగులుగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు.. నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story