ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. దీంతో సీఎస్ గా నీలం సాహ్ని డిసెంబర్ 31 వరకూ కొనసాగనున్నారు. ఇదిలావుంటే సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ సీఎం జగన్

ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఆమె పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది. అయితే మరో ఆరునెలలు పొడిగించాలని సీఎం జగన్ గతంలో కేంద్రాన్ని కోరారు. అప్పట్లో కేంద్రం నీలం సాహ్ని పదవీకాలానికి మూడు నెలల మాత్రమే పొడిగింపు ఇచ్చింది. తాజాగా మరో మూడునెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story