ఏపీలో మరోసారి పదివేలకు పైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 62,938 శాంపిల్స్ ను పరీక్షించగా 10,171 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పది మంది, అనంతపూర్‌ లో తొమ్మిది మంది, గుంటూరు లో తొమ్మిది మంది, నెల్లూరు లో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరి లో తొమ్మిది మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, కడప లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, కృష్ణ లో

ఆరుగురు, కర్నూల్‌ లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు

,విజయనగరం లో ముగ్గురు మరణించారు. గడచిన 24 గంటల్లో 7,594 మంది కోవిడ్‌ నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,04,065 పాజిటివ్ కేసు లకు గాను 1,17,569 మంది డిశ్చార్జ్ కాగా.. 1,842 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 84,654 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story