నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల ఆందోళన

నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల ఆందోళన

నెల్లూరు జిల్లాలో కరోనా బాధితులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ గూడూరు లోని గాంధీనగర్ రోడ్డులో బైఠాయించారు. క్వారంటైన్ సెంటర్ లో వైద్యులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెంటర్ నుంచి తమను ఇంటికి పంపాలి అంటూ నినాదాలు చేశారు.

కాగా ఏపీలో కరోనా టెర్రర్ పుట్టిస్తోంది. గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ను పరీక్షించగా 10,080 మందికి కోవిద్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,14,145 పాజిటివ్ కేసులకు గాను.. 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా..1,939 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story