మరో ఐదు రోజుల పాటు ఆలయ ప్రవేశం లేదు..

మరో ఐదు రోజుల పాటు ఆలయ ప్రవేశం లేదు..

వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతోంది. మరో అయిదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే దానిని బట్టి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనాలను కల్పించాలని భావిస్తున్నారు ఆలయ అధికారులు. ఇప్పటికే 25 రోజులుగా భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది దేవస్థానం. కరోనా వ్యాప్తి నియంత్రణకు నిబంధనలు కఠినంగా అమలు పరిస్తేనే నివారణ సాధ్యమని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. ఈ మేరకు ఆలయ భద్రతా అధికారి శ్రీనివాస్ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకోవాలని కోరారు. అయితే స్వామి వారి నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story