బొత్సకు మాతృవియోగం

X
By - TV5 Telugu |16 Aug 2020 4:12 PM IST
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొంది. బొత్స తల్లి ఈశ్వరమ్మ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆస్పత్రిలో చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈశ్వరమ్మ మరణంతో బొత్స ఇంట విషాదం నెలకొంది. విజయనగరంలో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. బొత్స తల్లి మరణంపై రాజకీయ ప్రముఖుల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com