ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు స్టార్ క్రికెటర్లు దూరం
By - TV5 Telugu |15 Aug 2020 7:03 PM GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ దశ మ్యాచ్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు దూరంకానున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 16 మధ్య మూడు టీ 20లు, మూడు వన్డేల్లో ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్ -13 కోసం వారం రోజులు ఆలస్యంగా తమ తమ జట్లతో కలవనున్నారు. ఐపీఎల్ 8 జట్లలో రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 29 మంది ఉన్నారు. ఒక్క ఆసిస్ నుంచే 12 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com