ఉమ్మడి అనంతపురంలో ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ లోకేష్ పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. నేడు 62వ రోజు ఉదయం 8 గంటలకు కూడేరు క్యాంప్ నుంచి ప్రారంభం కానుంది. అనంతరం సంగమేష్ కాలనీలో స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. అరవ కూరులో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. కమ్మూరు శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి చేపట్టనున్నారు. విరామ అనంతరం కమ్మూరు శివారు నుంచి పాదయాత్ర మొదలై శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. కోటంక వద్ద స్థానికులతో మాటమంతీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత కోటంక గండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు చేయ నున్నారు. అనంతరం పాదయాత్రను ముగించుకొని రాత్రికి మార్తాడు వద్ద విడిది కేంద్రంలో బస చేయనున్నారు. ప్రతీ రోజు 16 కిలోమీటర్లు నడుస్తున్న లోకేష్.. ఇప్పటివరకు 790 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తిచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com