AP : చందనోత్సవ నిర్వహణ వైఫల్యంపై కొనసాగుతోన్న దర్యాప్తు

AP : చందనోత్సవ నిర్వహణ వైఫల్యంపై కొనసాగుతోన్న దర్యాప్తు

విశాఖలోని సింహాచలం చందనోత్సవ నిర్వహణ వైఫల్యంపై.. జేసీ స్వామినాథన్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తొలిరోజు విచారణలో భాగంగా పోలీసుల ధోరణిపై దేవాదాయశాఖ సిబ్బంది వాపోయారు. పోలీసులు తమ కాలు కదపనివ్వ లేదని, అంతా వారి చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. మంత్రి ప్రోటోకాల్‌ డ్యూటీలో ఉన్నామని చెప్పినా వినపించుకోలేదన్నారు. డ్యూటీ పాయిట్‌కు వెళ్లాల్సి ఉందని చెప్పినా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు చేరుకోవాలని మూడు గంటల ముందే ఇంటి నుంచి ప్రయాణమైనా.. కొండపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సకాలంలో చేరుకోలేకపోయామని జేసీకి తెలిపారు. విచారణలో భాగంగా తొలిరోజు 43 మందిని విచారించిన జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌.. ఇవాళ మరో 65 మందిని విచారించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story