నేడు కావలిలో సీఎం జగన్ పర్యటన
By - Subba Reddy |12 May 2023 6:15 AM GMT
ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటించనున్నారు
ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. అయితే జగన్ పర్యటనతో కావలి ప్రజలకు కష్టాలు మొదలైయ్యాయి. వారం ముందు నుంచే షాపులు మూయించారు అధికారులు. హెలీప్యాడ్ పరిసర కాలనీల్లో కరెంట్ కట్ చేయడంతో అంధకారం నెలకొంది. మరోవైపు పచ్చని చెట్లు నరికేశారు మున్సిపల్ అధికారులు. పట్టణంలో అడుగడుగున ఆంక్షలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. రామిరెడ్డి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అవినీతిని ప్రశ్నించిన టీడీపీ,జనసేన..బీజేపీ,ప్రజాసంఘాల నేతలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు. కావలి పట్టణం మొత్తం పోలీస్ వలయంలా మారిపోయింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com