సెల్ టవర్‌ ఎక్కి 1998 డీఎస్సీ బ్యాచ్ అభ్యర్థుల నిరసన

సెల్ టవర్‌ ఎక్కి 1998 డీఎస్సీ బ్యాచ్ అభ్యర్థుల నిరసన

గుంటూరులో 1998 డీఎస్సీ బ్యాచ్ అభ్యర్థుల ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగాలు వచ్చినా.. ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సెల్ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు.వైసీపీ సర్కార్‌ తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేవలం 4వేల 500మందికి మాత్రమే పోస్టింగ్‌ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా తమకు కూడా పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story