ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్‌ కేసులు
తాజాగా గడిచిన 24 గంటల్లో 48,313కరోనా టెస్టులు చేయగా, 137 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 48,313కరోనా టెస్టులు చేయగా, 137 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. అటు గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీనితో మరణించిన వారి సంఖ్య 7,146కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 167 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా 8,75,165 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,488గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.


Tags

Read MoreRead Less
Next Story