ఏపీలో కొత్తగా 2,949 మందికి కరోనా
By - kasi |28 Oct 2020 2:00 PM GMT
ఏపీలో గత 24 గంటల్లో 77.028 శాంపిల్స్ ను పరీక్షించగా 2,949 మందికి కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో..
ఏపీలో గత 24 గంటల్లో 77.028 శాంపిల్స్ ను పరీక్షించగా 2,949 మందికి కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, చిత్తూరు లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఒక్కరు , విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 3,609 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,11,879 పాజిటివ్ కేసు లకు గాను.. 7,78,614 మంది డిశ్చార్జ్ కాగా.. 6,643 మంది మరణించారు.. ప్రస్తుతం 26,622 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 77,73,681 శాంపిల్స్ ను పరీక్షించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com