ఏజెన్సీలో దారుణం : ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

ఏజెన్సీలో దారుణం : ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. వరుసకు పెద్దనాన్న అయ్యే తెడ్ల శ్రీను అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో జడ్డంగి పోలీస్‌ స్టేషన్‌లో ఆ కామాంధుడిపై కేసు నమోదు చేశారు. చికిత్స కోసం బాలికను అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story