ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అమరావతి సెగ
By - Nagesh Swarna |8 Oct 2020 9:47 AM GMT
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అమరావతి సెగ తగిలింది.. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవిని అమరావతి రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. దీంతో తుళ్లూరులో గందరగోళ పరిస్థితి నెలకొంది.. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రైతులు నినాదాలతో హోరెత్తించారు. గో బ్యాక్ శ్రీదేవి అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా రైతులు రోడ్డుమీదకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com