AP: జగన్ సర్కార్‌పై ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు ఫైర్‌

AP: జగన్ సర్కార్‌పై ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు ఫైర్‌
ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం లేదంటే ఎవరు సిగ్గుపడాలంటూ ఫైర్

జగన్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఫైరయ్యారు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం లేదంటే ఎవరు సిగ్గుపడాలని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల్ని ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన నిలదీశారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని మీరే చెబుతున్నారు మరి అలాంటప్పుడు మా బకాయిలు చెల్లించాల్సిన ఆర్థిక శాఖ అధికారులు ఎక్కడికి పోయారన్నారు. ఎందుకు మాకు లెక్కలు చెప్పడం లేదని బొప్పరాజు ప్రశ్నించారు. ప్రభుత్వంలో భాగస్వాములైన తమకే లెక్కలు తెలియకపోతే ఎలా?.. ఓపిక ఉన్నంతవరకు ఆగాం.. ఇకపై ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story