AP: ఏపీ బీజేపీలో కోల్డ్ వార్.. పురంధేశ్వరి, జీవీఎల్ మధ్య మాటల మంటలు

AP: ఏపీ బీజేపీలో కోల్డ్ వార్.. పురంధేశ్వరి, జీవీఎల్ మధ్య మాటల మంటలు
జిల్లాల పేర్లతో పాటు పలు కార్యక్రమాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లు మాత్రమే పెడుతున్నారని జీవీఎల్ ఆరోపణ

ఏపీ బీజేపీలో మరో వివాదం నెలకొంది. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఏపీ బీజేపీని కుదిపేసింది. వరుస పెట్టి సోమువీర్రాజుపై విమర్శలు గుప్పించారు. అనంతరం కన్నా పార్టీకి రాజానామా చేశారు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు పురంధేశ్వరి, జీవీఎల్ మధ్య మాటల మంటల కొనసాగుతున్నాయి.

అన్ని ప్రాజెక్టులకు ఆ ఇద్దరిపేర్లే పెడుతున్నారని జీవీఎల్ అనడంతో వివాదం చెలరేగింది. జిల్లాలో పేర్లతో పాటు పలు కార్యక్రమాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లు మాత్రమే పెడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇక రంగాపేరు కూడా పెడితే బాగుంటుందన్నారు. అయితే జీవీఎల్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి భగ్గుమన్నారు. వారు మహానాభావులని వారిద్దేరే అనడం సరికాదంటూ జీవీఎల్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా జీవీఎల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక ఈ ఇద్దరి నేతల వ్యాఖ్యలతో ఏపీ బీజేపీలో మరోసారి కోల్డ్ వార్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందోనని నేతలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story