AP : ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులపై బొత్స ఫైర్

AP : ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులపై బొత్స ఫైర్
మాకు లేవా బాధలు మీకేనా... యూజ్ లెస్ ఫెలో.., నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ రెచ్చిపోయారు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులకు మంత్రి బొత్స సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా... స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేయడానికి కాన్వాయ్ దగ్గరకు వెళ్లిన నాయకులపై బొత్స మండిపడ్డారు. ఫిర్యాదు చేయడానికి ఇది సమయం కాదని కావాలంటే విజయనగరం వచ్చి ఫిర్యాదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పక్కనే ఉంటుండగా ఫిర్యాదు చేయడంతో క్లాస్ పీకారు. మాకు లేవా బాధలు మీకేనా... యూజ్ లెస్ ఫెలో.., నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ రెచ్చిపోయారు. జరిగిన తతంగాన్ని వీడియో తీస్తున్న జర్నలిస్టును కెమెరా ఆపాలన్నారు మంత్రి బొత్స.

Tags

Read MoreRead Less
Next Story