AP : ధాన్యం కొనలేదు.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాక్టర్లు

AP : ధాన్యం కొనలేదు.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాక్టర్లు

వైసీపీ ప్రభుత్వ తీరుతో విశాఖ జిల్లా ఎలమంచిలి మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో మేడపాడు రైస్‌మిల్లు వద్ద కిలోమీటర్ల మేర ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఎప్పుడుకొంటారో తెలియక రైతులు దిగాలు చెందుతున్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ధాన్యం ట్రాక్టర్లు నిలవడంతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చలించిపోయారు. రైతుల దగ్గరికి వెళ్లి స్వయంగా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించడం ఒక ఎత్తు అయితే.. పండించిన ధాన్యం అమ్మడం మరో ఎత్తు అన్నారు. 40 ఏళ్లలో ఏ ప్రభుత్వానికి ఈ దుస్థితి పట్టలేదన్నారు. ఇంత అన్యాయమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story