ఏపిలో కొత్తగా 10,175 మందికి కరోనా

ఏపిలో కొత్తగా 10,175 మందికి కరోనా
ఏపిలో కరోనా మహమ్మారి విస్ఫోటనం చెందుతోంది. గత 24 గంటల్లో 72,229 శాంపిల్స్‌ ని పరీక్షించగా 10,175 మంది..

ఏపిలో కరోనా మహమ్మారి విస్ఫోటనం చెందుతోంది. గత 24 గంటల్లో 72,229 శాంపిల్స్‌ ని పరీక్షించగా 10,175 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో తొమ్మిది మంది, కడప లో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, కృష్ణ లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, అనంతపూర్‌ లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, గుంటూరు లో ఇద్దరు , విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 10,040 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,34,792 పాజిటివ్ కేసు లకు గాను 4,32,752 మంది డిశ్చార్జ్ కాగా.. 4,702 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,338 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story