ఏపీలో అదుపులోకి రాని కరోనా.. 24 గంటల్లో కేసులు చూస్తే..

ఏపీలో అదుపులోకి రాని కరోనా.. 24 గంటల్లో కేసులు చూస్తే..
ఏపీలో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాలేదు.. గత 24 గంటల్లో 84,401 శాంపిల్స్ ని పరీక్షించగా 2,886 మందికి కరోనా సోకింది.. కరోనా కారణంగా కృష్ణ లో ముగ్గురు..

ఏపీలో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాలేదు.. గత 24 గంటల్లో 84,401 శాంపిల్స్ ని పరీక్షించగా 2,886 మందికి కరోనా సోకింది.. కరోనా కారణంగా కృష్ణ లో ముగ్గురు, అనంతపూర్‌ లో ఇద్దరు, చిత్తూరు లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు. అదే సమయంలో 3,623 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇదిలావుంటే రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,17,670 పాజిటివ్ కేసు లకు గాను.. 7,85,480 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 6,676 మంది ప్రాణాలు కోల్పోయారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,514 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story