ఏపీలో కొత్తగా 9,901 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో కొత్తగా 9,901 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 75,456సాంపిల్స్‌ ని పరీక్షించగా 9,901 మందికి ..

ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 75,456సాంపిల్స్‌ ని పరీక్షించగా 9,901 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల కడప లో తొమ్మిది మంది, చిత్తూరు‌ లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఎనిమిది మంది, నెల్లూరు లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, కృష్ట లో ఐదుగురు, కర్నూల్‌

లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, అనంతపూర్‌ లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ముగ్గురు, శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 10,292 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,54,692 పాజిటివ్ కేసు లకు గాను 4,54,113 మంది డిశ్చార్జ్ కాగా.. 4,846 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 95,733 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story