AP Highcourt: అమరావతి అసైన్డ్ భూములపై విచారణ వాయిదా

AP Highcourt: అమరావతి అసైన్డ్ భూములపై విచారణ వాయిదా

అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ వచ్చే నెల 1కి వాయిదా పడింది. అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలన్న C.I.D. పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ధర్మాసనం పరిశీలించింది. కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు ఆడియో ఫైల్స్ ను అందించారు. రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని తెలిపారు. సీఐడీ పిటిషన్ విచారణపై మాజీమంత్రి నారాయణ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు. తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్నారు . వేరే కేసులోని ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. కేసు రీఓపెన్ కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న ధర్మాసనం... విచారణను వచ్చేనెల 1కి వాయిదా వేసింది. ఇదే కేసులో మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ పై విచారణను నవంబర్ 1కి ధర్మాసనం వాయిదా వేసింది

Next Story