జగన్ పాలనలో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు : తులసిరెడ్డి
By - TV5 Digital Team |6 Jan 2021 1:57 PM GMT
సీఎం జగన్ పాలనలో ప్రజల ధనమాన ప్రాణాలకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ తులసీ రెడ్డి.
సీఎం జగన్ పాలనలో ప్రజల ధనమాన ప్రాణాలకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ తులసీ రెడ్డి. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకు పోవడం రౌడీయిజానికి పరాకాష్ట అన్నారు. పేకాట రాయుళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో పేకాట మూడు పువ్వులు ఆరుకాయాలుగా ఉందన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాంగ్రెస్ విధానమన్నారు. జగన్ కుటుంబసభ్యులులోని ఒక్కరూ కూడా రాజధాని అమరావతి మనుంచి విశాఖ తరలించడానికి ఒప్పుకోరన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com