ప్రజాభిమానం కోల్పోయిన జగన్‌ రెడ్డి: అయ్యన్నపాత్రుడు

ప్రజాభిమానం కోల్పోయిన జగన్‌ రెడ్డి: అయ్యన్నపాత్రుడు

ప్రజాభిమానం కోల్పోయిన జగన్‌ రెడ్డి.. ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లను తొలగించి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు వాలంటీర్ల ద్వారా జగన్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నర్సీపట్నం నియోజకవర్గంలోనే 17 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని అన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటును చెక్‌ చేసుకోవాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story