వాడి బాధ చూడలేకపోతున్నా.. మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వమని తల్లి కోరిన కొన్ని గంటల్లోనే..

వాడి బాధ చూడలేకపోతున్నా.. మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వమని తల్లి కోరిన కొన్ని గంటల్లోనే..
అమ్మని ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకున్నాడో ఏమో.. మెర్సీకిల్లింగ్ కు అనుమతి కోరిన రెండు గంటల్లోనే..

కళ్ల ముందు కన్న కొడుకు పడుతున్న బాధ చూడలేక ఆ తల్లి కోర్టుకు వెళ్లింది. మెర్సీ కిల్లింగ్ కి అనుమతి తీసుకుని ఆటోలో వస్తుంటేనే అమ్మ ఒడిలో ప్రాణాలు కోల్పోయాడు.

కని పెంచిన బిడ్డ కళ్ల ముందు ఆడుతూ, పాడుతూ తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎనలేని ఆనందం. కానీ దురదృష్టం కొద్దీ ఆ బిడ్డ పుట్టినప్పటినుంచే అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్నాడు. బిడ్డ బాధ చూడలేక తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రిలేదు. చూపించని వైద్యుడు లేడు.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ పుంగనూర్ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అయినా తన కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలి లేదా మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వమని అభ్యర్థించింది.

రెండు రోజులుగా కోర్టుకు వెళుతున్నారు. నిన్న ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లవాడు రక్తస్రావం జరిగి మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story